ఉదయభానుకి ఘోర అవమానం..!

Edari Rama Krishna
నటి, యాంకర్ ఉదయభాను ఈ మద్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆమె తల్లి కాబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ఉదయభాను దాదాపు సంవత్సర కాలంగా ఎవరికీ ఎక్కడా కనిపించలేదు. అయితే ఆమె యూఎస్ వెళ్లిందని ఒకరూ..యాంకరింగ్ మానివేసిందని కొంతమంది ఆలా రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ సందర్భంగా  ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఉదయభాను తను ప్రస్తుతం ప్రేగ్నెంట్ కావడంతో అన్ని ప్రోగ్రామ్స్ కి బ్రేక్ చెప్పానని అంటుంది. అంతే కాదు తనకు ఇండస్ట్రలో చెప్పుకోవడానికి ఎన్నో తీపి జ్ఞాపకాలు, చేతు జ్ఞాపకాలు ఉన్నాయని అంటుంది. తన కెరీర్ లో ఎన్నోబాధలు పడ్డానని చిన్నప్పటి నుంచి నటి తన కోరిక అని అది నిజం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డట్టు చెప్పింది.


అందే కాదు ఇండస్ట్రీలో ఓ సింగర్ తనను ఘోరంగా అవమానించిందని అన్నారు..ఆ మద్య యూఎస్ లో ఓ ప్రోగ్రామ్ చేసినపుడు..ఓ ఫేమస్ సింగర్ స్టేజ్ పై తనను అవమానించిన తీరు ఇప్పటికీ మరచిపోలేక పోతున్నానని అంది ఉదయభాను. సదరు సింగర్ ను స్టేజ్ మీదకు పిలిచేటపుడు ఉదయభాను ఆమె గురించి ఎంతో గొప్పగా చెప్పేదట.  అయితే చివరి రోజు మాత్రం అందరికంటే ముందు ఆమె స్టేజ్ పైకి వెళ్లి తరువాత ఉదయభానుని పిలుస్తానని అనడంతో ఉదయభాను అక్కడే ఆగిపోయిందట. తర్వాత అందరినీ స్టేజ్ పైకి పిలిచిన ఆమె తనను మాత్రం పిలవకుండా అలాగే అక్కడే ఉంచడంతో చాలా బాధ వేసిందని ఆ తర్వాత ఓ కమెడియన్ గ్రూప్ ఏదో స్కిట్ వేశారు.

అప్పుడు వాళ్ళు నన్ను స్టేజీ మీదకు పిలిచారు. అప్పుడు నేను స్టేజ్ పైకి వెళ్తున్న సమయంలో సదరు సింగర్ తరుపునుంచి వచ్చిన ఆర్కెస్టా ఓ అవమానకరమైన ట్యూన్ (బాధకరమైన ) ప్లే చేస్తూ నవ్వుకున్నారు. దాంతో తన మనసు మరింత గాయమైందని వెంటనే స్టేజి ఎక్కిన నేను ‘నాకు మళ్లీ అమెరికాకు రావాలని లేదు...మీరే ఇండియా రండి..అక్కడ మీకోసం ఓ వ్యక్తి ఎదురు చూస్తుంది..ఆమె మీ అమ్మ ’ అనడంతో ఒక్కసారిగా ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది.  


వెంటనే ఆ సింగర్ వచ్చి వాస్తవానికి నిన్ను పిలుద్దామనే అనకుంటున్నా.. అంటూ ఏవోవో చెప్పింది. నేను పట్టించుకోలేదు  అని చెప్పింది ఉదయభాను. అయితే ఇలాంటి అవమానం తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని అదీ తప్ప ఇండస్ట్రీలోని వారు తనకు మంచి ఆప్త మిత్రులు ఉన్నారని అన్నారు ఉదయభాను.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: