బాహుబలి షూటింగ్ లో అనుకోని అతిధి..ఎవరూ..?!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలకు నాంధి పలికిన చిత్రం ‘బాహుబలి’ ఈ చిత్రంతో తెలుగు ఇండస్గ్రీ రేంజ్ హాలీవుడ్ కి పాకింది. దాదాపు రెండు సంవత్సరాలు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని కలెక్షన్లు 600 కోట్లకు పైగా ఈ సినిమా రాబట్టింది. ఫ్యూజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.  ఇక ఈ సినిమాలో చివరికి అమరేంద్ర బాహుబలిని ఎంతో నమ్మకంతో పెంచిన కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు...అక్కడితో చిత్రం ఆగిపోతుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ బాహుబలి 2 షూటింగ్ జరుగుతుంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి: ది కన్క్లూజన్' చిత్రం ప్రస్తుతం యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకొంటున్నారు.  యూద్ద సన్నివేశాలు చివరి షెడ్యూల్ జరుగుతున్న సమయంలో అనుకోని అతిధిగా వచ్చారు.. వరుణదేవుడు. ఈ షూటింగ్ లో  పాలు పంచుకోవాలని ఉద్దేశ్యంతో నిన్నటి నుంచి బీభత్సంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

ఇక లాభం లేదునుకున్న బాహబలి టీమ్ షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్ లో ఎంచక్కా క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారు..ఇది రాజమౌళి ట్వీట్ చేశారు. అంతే కాదు క్రికెట్ ఆడుకున్నది అభిమానులకు పంచుకున్నారు. రానా, తమన్నా, అనుష్క ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రాజమౌళి ట్విట్ :
Last day of war and rain plays spoil sport.

Unit decides to utilise it for cricket.. pic.twitter.com/o4FOLRhy5u

— rajamouli ss (@ssrajamouli) August 30, 2016

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: