తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కి నటవారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతోనే తన మాస్ జోష్ చూపించాడు. తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘చత్రపతి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు..మిస్టర్ పర్ఫెక్ట్,డార్లింగ్,మిర్చిలాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాల్లో నటించారు. గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటిన చిత్రం ‘బాహుబలి’. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. అయితే బాహుబలి చిత్రం షూటింగ్ సమయంలో పెళ్లి చేసుకోకుండా కేవలం సినిమాకు మాత్రమే తన టైమ్ కేటాయించారు..ఈ సినిమా తర్వాత ఇప్పుడు బాహుబలి 2 చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇక బాహుబలి షూటింగ్ డిసెంబర్ వరకు పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు రాజమౌళి నిన్న లోగో ఆవిష్కరణ్ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్ అక్టోబర్ 5న ఒక సంచలన వార్త అందరికీ చెప్పబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అందరికీ క్యూరియాసిటి పెరిగిపోయింది..ఆ రోజు పెళ్లి గురించి చెబుతాడా..లేదా కొత్త సినిమా గురించి చెబుతాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి అక్టోబరు 5 దాకా ఆగకుండా ‘గుడ్న్యూస్’ చెప్పేశారు. అదేంటంటే.. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ హీరో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల మైనపు విగ్రహాలను తయారుచేసి ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్, షారుక్, ఐశ్వర్యలకు ఇప్పటికే అక్కడ స్థానం లభించిన సంగతి తెలిసిందే. అలాంటి చోట దక్షిణాది నుంచి తొలిసారిగా ప్రభాస్కి చోటు లభించడం విశేషం. ఈ విగ్రహం 2017 వరకు పూర్తి చేసి ప్రదర్శనకు సిద్దం చేస్తారట. ప్రభాస్ విగ్రహం మేడమ్ టుస్సాడ్స్లో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
అందుకు హర్షం వ్యక్తం చేశారు.ఇటీవల మేడమ్ టుస్సాడ్స్కి చెందిన సిబ్బంది హైదరాబాద్ వచ్చి ప్రభాస్ విగ్రహానికి అవసరమైన సమాచారం తీసుకున్నారు. శరీర కొలతలతో పాటు వివిధ కోణాల్లో 350 ఫొటోలను తీశారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ పోషించిన అమరేంద్ర బాహుబలి ఆహార్యంతో ఈ విగ్రహం ఉంటుందని వారు తెలిపారు.