తెలుగువైపు ప్రాచీ చూపు

Chowdary Sirisha
ప్రాచీ దేశాయ్... టీవీ సీరియల్ తో నట జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారగా ఎదిగింది. ‘రాక్ ఆన్’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జాన్ అబ్రహంతో ఓ సినిమాలో కనిపించబోతోంది. ఈ అమ్మడికి తెలుగు తెరపై నటించాలన్న కోరిక కలిగిందట. ఇదే మాట కొందరు ప్రముఖ నిర్మాతల ముందు ప్రస్తావించిందని సమాచారం. ‘తెలుగులో మహేష్ బాబు అంటే నాకు చాలాచాలా ఇష్టం. అతడితో నటించాలని ఉంది. మహేష్ నటించిన కొన్ని చిత్రాలను చూశాను. ఇటీవలే అతడు నటించిన థమ్స్ అప్ వాణిజ్య ప్రకటన నాకు ఎంతో నచ్చింది. అది టీవీలో వస్తుంటే ఏ పని చేస్తున్నా ఓ క్షణం ఆగిపోయి చూస్తాను. అతడి పక్కన ఎలాంటి పాత్ర ఇచ్చినా నటించేందుకు నేను సిద్ధం’ అంటోందీ ముంబై ముద్దుగుమ్మ. డియర్ నిర్మాతలూ... మన కోసం మరో కొత్త భామ సిద్ధంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: