నగ్నంగా నటించానని సిగ్గులేకుండా చెబుతుంది..!

Edari Rama Krishna
ఈ మద్య బాలీవుడ్ ఇండస్ట్రీలో హాలీవుడ్ ని తలదన్నే సన్నివేశాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా టాప్ పొజీషన్లో ఉన్న హీరోయిన్లు కూడా రెచ్చిపోయి మరీ కొన్ని బూతు సీన్లలో నటిస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్నారు.  వాస్తవానికి గత కొంత కాలంగా బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు బాగా పెరిగిపోయాయి.   ఇలాంటి సినిమాలకు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువగా ఉండటంతో కొంత మంది నిర్మాతలు వీటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  ఏదో చిన్న క్రైమ్, థ్రిల్లర్,కామెడీ లాంటి స్టోరితో సినిమాలు తీయడం.. అందులో బి గ్రేడ్ హీరోయిన్లు రెచ్చిపోయి విచ్చల విడి శృంగార సన్నివేశాల్లో నటించడం జరుగుతుంది.  

ఆ మద్య సన్నీలియోన్ నటించిన మస్తీజాదే చిత్రాన్ని చూసి సెన్సార్ బృందం షాక్ కి గురైందట. ఎన్నో కటింగ్స్ చేయగా మొత్తానికి సినిమా రిలీజ్ కావడం మంచి కలెక్షన్లు సాధించడం జరిగింది..అయితే ఈ చిత్రంలో ఓ సన్నవేశంలో సన్నీ ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించింది.  తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్ లో మరొకటి రిపీట్ అయ్యింది. అప్పట్లో తెలుగులో ప్రభాస్ సరసన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో నటించిన కంగనా రౌనత్ బాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.  

ఈ అమ్మడు నటించి ‘రంగూన్ ’ ఫిబ్రవరి 24 న రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో నగ్నం గా నటించడమే కాదు , శృంగార సన్నివేశాల్లో కూడా ఎలాంటి డూప్ లేకుండా నేనే నటించానని ధైర్యం గా చెబుతోంది హాట్ భామ కంగనా రనౌత్.  ఈ చిత్రంలో తాను సన్నివేశాలకు తగ్గట్టుగానే నటించానని అంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో టాప్ లేస్ గా, నగ్నంగా నటించిన సన్నివేశాలు ఉన్నాయి..అవి మాత్రం డూప్ ని ఉపయోగించి ఉంటారని వార్తలు వచ్చాయి.

కానీ  ఆ వార్తలను ఖండించడమే కాకుండా నగ్న సన్నివేశాల్లో నేనే నటించానని నటన లో అది కూడా ఒక భాగమని స్పష్టం చేసింది కంగనా .  విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగూన్ చిత్రాన్ని ఈనెల 24 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సంచలనం సృష్టిస్తుండగా కంగనా నగ్న పోస్టర్ లతో రంగూన్ పై అంచనాలు పెరిగాయి . 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: