రజినీకాంత్ ని అంతమాట అన్నాడట...!

Edari Rama Krishna
తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన గొప్ప నటులు సూపర్ స్టార్ రజినీకాంత్.  అయితే తమిళనాట రజినీకాంత్ అంటే తమిళతంబీలు ఎంతగా ఇష్టపడతారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  రజినీ సినిమా వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచి పండుగ వాతావరణం నెలకొంటుంది.  కబాలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 లో నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అయింది..టెక్నికల్ వర్క్ నడుస్తుంది.  

అయితే తమిళనాట రజినీకాంత్ అంటే తోటి నటులకు కూడా ఎంతో అభిమానం..గౌరవం ఉంటుంది. అయితే ఓ సీనియర్ నటుడు మాత్రం రజినీకాంత్ ని ఏరా..ఓరేయ్ అంటూ పిలిచేవాడట.  అంతే కాదు ఓ సందర్భంలో ఏరా ! నువ్వు నాకు పోటీనా ? అంటూ గుడ్లు ఉరిమి మరీ చూశాడట..ఇంతకీ ఆ సినియర్ నటులు ఎవరో కాదు శివాజీ గణేశన్.   అయితే ఆ మాట విన్న రజినీకాంత్ ఆశ్చర్యపోయారట..కానీ శివాజీ గణేశన్ ఆ మాటలన్నది కోపంతో మాత్రం కాదు..ఎంతో అభిమానంతో అవును అప్పట్లో రజినీకాంత్ మూడు భాషల్లో మంచి పవర్ ఫుల్ నటుడుగా ఎదుగుతున్న సమయంలో శివాజీ గణేశన్ ఈ మాటలు అన్నాడట.  అంతే కాదు సినీయర్ నటులైన శివాజీ గణేశన్ అంటే రజినీకాంత్ కి ఎక్కడ లేని గౌరవం.

రజనీ అన్నా అతడి స్టైల్ అన్నా చాలా చాలా ఇష్టమట అందుకే రజనీకాంత్ అంటే మక్కువ ఆ మక్కువతోనే రజనీకాంత్ ని ఏరా ..... ఒరేయ్ అని పిలిచేవాడట శివాజీ గణేశన్.  అసలు విషయానికి వస్తే..శివాజీ గణేశన్ మనవడు విక్రమ్ ప్రభు నిర్మించిన తమిళ చిత్ర ఆడియో వేడుక చెన్నై లోని శివాజీ గణేశన్ ఇంట్లో జరిగింది . ఆ వేడుకకు ముఖ్య అథితి గా రజనీకాంత్ వచ్చాడు . దాంతో శివాజీ గణేశన్ కు తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నాడు .  అప్పట్లో ఈ ఇద్దరు నటులు నటించిన చిత్రం ‘నరసింహ’ తెలుగులో బాక్సాఫీస్ షేక్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: