తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన చిత్రం ‘జల్సా’ ఎంతో హిట్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో ఇలియాన ఫ్రెండ్ గా నటించిన పార్వతి మెల్టన్ గుర్తుంది కదా..ఈ అమ్మడు వెన్నెల మూవీతో పరిచయమైనప్పటికీ జల్సా చిత్రంతో మంచి పేరు వచ్చింది. ఇక పవన్ కళ్యాన్ సినిమాలో నటించింది..మంచి స్టార్ ఇమేజ్ వస్తుందనికున్న ఈ అమ్మడికి అంతగా అదృష్టం కలిసి రాలేదు.
తర్వాత మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రంలో 'పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు' అంటూ ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ పాట మంచి హిట్ అయినా..పాపం ఈ అమ్మడికి ఏదీ కలిసి రాలేదు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన పార్వతి మెల్టన్.. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైపోయింది.
దాదాపు ఐదేళ్లుగా వెండితెరకు దూరమై పోయింది. ఈ మద్య ఈ బ్యూటీ వెకేషన్ కు వెళ్లింది..అక్కడ సిల్వర్ కలర్ మైక్రో బికినీలో కుర్రకారు మతులు పోయేలా ఫోటో షూట్స్ తీయించుకుంది. మరి ఇన్నేళ్ల తర్వాత ఇంత హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో పోజులు ఇవ్వడానికి కారణం.. మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ అని అందరూ అనుకుంటున్నారు.