తెలుగు సినీరంగంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారి లిస్ట్ ఏ స్థాయిలో ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వెండి తెరపై తమ అందాలు వలకపోసి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాధించుకున్న చాలా మంది ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల పేర్లు ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్-1985లోని సెక్షన్ 67 ప్రకారం నోటీసులు పంపిన వారందరి పేర్లను ప్రకటించింది.
హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్న తేడా లేకుండా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నవారందరినీ విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 19 నుంచి 27 వరకు ‘మత్తు బాబుల’ను ప్రశ్నించబోతుంది. ఇప్పటికే గుర్తించి, నోటీసులు పంపించిన వారందరినీ వారంపాటు విచారించనుంది. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు.
హీరో : రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు. హీరోయిన్ చార్మీ, ముమైత్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్రీనివాసరావు(రవితేజ డ్రైవర్)