మరో సెన్సేషన్ : రియాలిటీ షోలో రామ్ దేవ్ బాబా ... !!

Vasishta

ప్రపంచవ్యాప్తంగా యోగా విన్యాసాలతో సుపరిచితుడైన రామ్ దేవ్ బాబా... పతంజలి ఉత్పత్తులతో మరింత పాపులర్ అయ్యారు. యోగా అంటే చాలు ఠక్కున గుర్తొచ్చేదీ రామ్ దేవ్ బాబాయే. ఇక పతంజలి ఉత్పత్తులు ఓ సెన్సేషన్. అయితే ఆయన త్వరలో మరో సెన్సేషన్ కు సిద్ధమవుతున్నారు. ఓ రియాలిటీ షోలో ప్రత్యక్షం కాబోతున్నారు.


          అవును.. మీరు విన్నది నిజమే.! రామ్ దేవ్ బాబా త్వరలోనే ‘ఓం శాంతి ఓం’ అనే రియాలిటీ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరించబోతున్నారు. రామ్ దేవ్ బాబా తో పాటు ప్రముఖ నటి సోనాక్షి సిన్హ మరో జడ్జిగా ఉండనున్నారు. లైఫ్ ఓకే ఛానల్ లో త్వరలోనే ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. వీళ్లిద్దరు మాత్రమే కాదు.. సింగర్ కనికా కపూర్, మ్యూజిక్ డైరెక్టర కమ్ సింగర్ శేఖర్ రవ్జియానీ కూడా జడ్జిల పాత్ర పోషించబోతున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో రన్ వీర్ సింగ్ గెస్ట్ గా రాబోతున్నారు.  


          ఇంతకూ రామ్ దేవ్ బాబా జడ్జిగా ఉండబోతున్న ఆ ప్రోగ్రామ్ ఏంటనేగా మీ సందేహం.. ఏం లేదండీ.. ఇదో భజనల పోటీ కార్యక్రమం. సినిమా పాటలు, డ్యాన్స్ లకు సంబంధించిన కార్యక్రమాలను మనం ఇప్పటివరకూ చాలా చూశాంకదా. అలాగే లైఫ్ ఓకే ఛానల్ భజనలపైన కాంపిటీషన్ పెడుతోంది. ఆ ప్రోగ్రామ్ కే వీళ్లంతా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. సోనాక్షి సిన్హ, రామ్ దేవ్ బాబా మధ్య మంచి స్నేహముంది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి జడ్జిలుగా వ్యవహరించబోతుండడంతో బాలీవుడ్ లో సెన్సేషన్ అవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: