ఇటీవల సౌత్ ఇండియన్ సినిమా స్క్రీన్పై సరికొత్త జానర్లో సినిమాలు వస్తున్నాయి. హీరోయిన్ ప్రధాన పాత్రలో హర్రర్, కామెడీ జానర్లో వస్తోన్న సినిమాలు ఎక్కువవుతున్నాయి. వీటిల్లో చాలా సినిమాలు సక్సెస్ అవ్వడంతో ప్రధాన హీరోయిన్లు సైతం ఇలాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొట్ట బుగ్గల సుందరి తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’.
తాప్సీతో పాటు కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్లతోనే రిలీజ్కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ రోజు థియేటర్లలోకి వస్తోన్న ఈ సినిమా యూఎస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఓవర్సీస్ ప్రీమియర్ షో టాక్ ప్రకారం సినిమాకు పాజిటివ్ స్పందనే వస్తోంది.
నలుగురు కమెడియన్లు ఉండడంతో అంచనాలకు తగ్గట్టుగానే కామెడీ ఉందంటున్నారు. హర్రర్, కామెడీ జానర్లో తెరకెక్కిన సినిమాయే అయినా అందులో కొత్తదనం ఉండేలా దర్శకుడు మహి వి.రాఘవన్ ప్లాన్ చేసుకున్న తీరు బాగుందంటున్నారు.
పాత్రల ఇంట్రడ్యూసింగ్, మంచి కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ను బాగా డీల్ చేసిన దర్శకుడు అద్భుతమైన ట్విస్ట్తో ఇంటర్వెల్ కార్డు వేశాడట. ఇక సెకండాఫ్లో కామెడీతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించేలా ఉందంటున్నారు. షకలక శంకర్, వెన్నెల కిషోర్ మేనరిజమ్స్, తాగుబోతు రమేష్ కామెడీ సూపర్బ్ అట.
ఇక మరో కమెడియన్ శ్రీనివాస్రెడ్డి పాత్రకు కథలో ప్రాధాన్యత ఉంది. తాప్సి పాత్ర చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా దర్శకుడు మహి వి రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్తో స్టార్ట్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి ఏపీ హెరాల్డ్.కామ్