భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. తాజాగా నృత్య దర్శకుడు ప్రభుదేవా ఓ విషయంలో కన్నీరు పెట్టుకున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు ధర్మరాజు (97) కన్నుమూశారు.బాడిగ ధర్మరాజు తన 20వ ఏట నుంచే డ్యాన్స్పై ప్రేమతో తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు.
అనంతరం చెన్నైలో స్థిర పడిన ఆయన ఎన్టీఆర్, కృష్ణ, మహేష్బాబు, ఉదయభాను, జూ.ఎన్టీఆర్ పలువురు ప్రముఖ హీరోలకు క్లాసికల్ డ్యాన్సర్గా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ముందు ప్రభుదేవ ధర్మరాజు వద్ద నృత్యం నేర్చుకున్నారు. హాంకాంగ్, హైదరాబాద్కు చెందిన పలువురు శిష్యులు ఇతని వద్దే శిక్షణ తీసుకుని ఎంతోమందికి నృత్యం నేర్పుతున్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో అనారోగ్యంతో మృతిచెందారు. గురువు మరణం తెలియగానే ప్రభుదేవా అక్కడికి చేరుకొని తన గురువు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. గురువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.