భూమికను చూసి భయపడుతున్న సాయిపల్లవి !
కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగువెలిగిన హీరోయిన్ భూమికా చావ్లా. చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ ఇలా అందరి టాప్ హీరోలతో ఆమె నటించింది. ఆతరువాత పెళ్లి చేసుకున్న భూమిక మెల్లగా ఫిలిం ఇండస్ట్రీలో ఫేడవుట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థుతలలో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి భూమిక ప్రయత్నిస్తోంది.
మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ ‘ఎంసిఏ’ మూవీతో మరోవారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ట్యాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి నటిస్థూ ఉన్నా సాయి పల్లవి కంటే భూమికకే ఈచిత్రంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీ కధ ఎక్కువగా భూమిక పాత్ర చుట్టూ తిరుగుతూ ఉండే సన్నివేశాలు ఉన్న నేపధ్యంలో భూమిక కూడా తన పాత్రకు తగ్గన్యాయం చేసిందట. ఆమె పాత్ర ఈసినిమా స్థాయిని పెంచుతుందని అంటున్నారు.
దీనితో భూమిక వల్ల సాయిపల్లవి రేంజ్ తగ్గుతుందా అనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఈమూవీ నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకునే ముందు స్వయంగా నిర్మాత దిల్ రాజు వేసిన కట్స్ చాలానే ఉన్నాయని అంటున్నారు. సినిమాలో నిజానికి వదిన అండ్ మరిది అనే కాన్సెప్టుతో ఎక్కువ సీన్లు ఉన్నా మధ్యలో సాయిపల్లవి చాలా సీన్లలో తన యాక్టింగ్ తో డామినేట్ చేయడంతో అశలు పాయింట్ నీరుగారి పోతుందని భయపడ్డ దిల్ రాజ్ సాయిపల్లవి యాక్టింగ్ స్కిల్స్ ను హైలెట్ చేసే సీన్స్ ను కట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో నాని అండ్ సాయి పల్లవిల రొమాన్స్ సీన్లు మాత్రమే ఉంచి నటన పరంగా భూమిక వదిన పాత్రను హైలెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సాయిపల్లవి నుండి మరోసారి ఆడియన్స్ ఏదైనా అదిరిపోయే పాత్రను చూడాలి అని కోరుకుంటున్న నేపధ్యంలో ఆమె సీన్లను పీకేసి వదిన పాత్ర అయిన భూమిక సీన్లను హైలెట్ చేస్తే ఆడియన్స్ ఒప్పుకుంటారా ? షాక్ తిని సినిమాను రిజెక్ట్ చేస్తారా ? అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు..