ఆంధ్రుల అన్నగారు తెలుగు ఆత్మగౌరవాని ఢిల్లీలో చాటిచెప్పిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర ను సాయి కోరపాటి నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు పాత్రను స్వయానా బాలకృష్ణ నటించడం విశేషం. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ వర్దంతి కోసం టీజర్ రెడీ అవుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది.
అంతేకాకుండా సారథి స్టూడియో లో టీజర్ కు సంబంధించి ఈ షూటింగ్ జరిగిందని షూటింగ్ లో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు అని హీరో బాలకృష్ణ పై కొన్ని సీన్లు చిత్రీకరించారు అని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాత్రం కేవలం ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టారు. ఇక ఫస్ట్లుక్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ఎలక్షన్ క్యాంపైయిన్ నిలబడి చేతిలో మైక్ పట్టుకున్న స్టిల్ పై ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి..’ అన్న క్యాప్షన్ ఇచ్చారు.
అయితే బాలకృష్ణ మీద తీసిన సన్నివేశాలు సరిగా రాలేదట, ఒకవేళ విడుదల చేసి ఉంటే సినిమా మిద నెగటివ్ ప్రచారం వస్తుందని ముందుగానే చిత్ర యూనిట్ ఈ క్రమంలో జాగ్రత్త పడిందని సమాచారం. అయితే తాజాగా విడుదలైన ఈ పోస్టర్ లో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తెలిసింది. ఈ బయోపిక్ కి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.