అడల్ట్ హర్రర్ చిత్రంలో ‘ఫిదా’ బ్యూటీ!

siri Madhukar
టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమా తెలుగు ప్రేక్షకులను నిజంగా ఎంతో ఫిదా చేసింది.  ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే..మళియాళ బ్యూటీ ప్రేమమ్ హీరోయిన్ సాయి పల్లవి అచ్చమైన తెలంగాణ యాస మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది. 

బద్మాష్.. బలిసిందారా...అంటూ తిట్టిన  తిట్లు కూడా సాయి పల్లవి నోటి నుంచి వస్తే ముద్దు ముద్దుగా మారిపోతాయి కదూ. ఫిదా చిత్రంలో సాయిపల్లవి తెలంగాణ యాసలో పలికే ప్రతి డైలాగ్ అద్భుతం అనిపించాయి.  ప్రేమమ్ చిత్రంతో సౌత్ లో పాపులర్ అయిన సాయి పల్లవి.. ఫిదా చిత్రంతో తెలుగు యువతని ఒక ఊపు ఊపింది. 

త్వరలో అడల్ట్ హర్రర్ చిత్రంలో హొయలు ఒలికించనుందని తెలిసింది. రొమాన్స్‌తో పాటు ఒళ్లుగగూర్పాటు కల్పించే హర్రర్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉంటుందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుందని నిర్మాత శాంతాను తెలిపారు.  ఈ మద్య నానితో నటించిన ఎంసీఏ చిత్రంలో కూడా సాయి పల్లవి తన నటనతో మెప్పించింది. 

తమిళ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. మరో కీలక పాత్ర కోసం ముద్దుగుమ్మ నిత్య మేనన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సాయి పల్లవి కళ్లతోనే మెస్మరైజ్ చేసే ఈ చిన్నది.. ఈ రొమాంటిక్ సినిమాలో ఎలా కనిపిస్తుందనే అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజ సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: