పవన్ ప్యాకేజీల పై క్లారిటీ ఇచ్చిన పోసాని !

Seetha Sailaja
ఏవిషయం పైన అయినా నిర్భయంగా మాట్లాడే పోసాని కృష్ణ మురళి నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ప్రకటించిన ఆమరణ నిరాహార దీక్ష పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ‘జనసేన’ అధినేతగా పవన్ కల్యాణ్‌ తాను నమ్ముతానని పవన్ చేసిన ఆరోపణలలో ఖచ్చితంగా నిజం ఉండి తీరుతుందని తన అభిప్రాయం అంటూ పోసాని వ్యాఖ్యానించాడు. 

అంతేకాదు పవన్ డబ్బుకు లొంగే వ్యక్తి అంటే తాను నమ్మనని డబ్బుకు ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం పవన్ ది కాదు అంటూ పవన్ కు బాసటగా నిలిచాడు ఈ సంచలన నటుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసుంటే పవన్‌కు ఏ పనైనా జరుగుతుందని చెపుతూ ఇంట్లో కూర్చొని పవన్ ఫోన్ చేస్తే అన్నీ అయిపోతాయని అలాంటి స్థితిలో పవన్ కేవలం ప్రజల కోసమే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాడు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

ఇదే సందర్భంలో పవన్ రెండు ఎకరాల్లో ఇల్లు కట్టుకోవడం కాదు వంద ఎకరాల్లో కూడా కట్టుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ డబ్బు సంపాదించుకోవాలంటే పవన్ ఇప్పటికే ఎంతో సంపాదించి ఉండేవాడని చెప్పుకొచ్చాడు. పవన్ తన దగ్గర డబ్బు లేదని తనను అడిగితే అతడికి 40 కోట్లు తాను రెడీ అంటూ పవన్ నోరు విప్పి అడిగితే ఎందరో కోట్లు గుమ్మరిస్తారు అన్న విషయాన్ని తెలియచేసాడు. 

ఇదే సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ చేస్తానన్న ఆమరణ దీక్షకు తాను మద్దతు ఇస్తానని చెపుతూ పవన్ దీక్షకు కూర్చోవాలని తాను కోరుకోవడం లేదని దీక్ష పేరుతో పవన్  చంపడానికి ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు పోసాని. అందువల్లనే తాను పవన్ దీక్షకు కూర్చో వద్దు అంటూ వేడుకుంటున్నానని పోసాని ఒక ప్రముఖ ఛానెల్ ద్వారా వ్యక్త పరిచిన అభిప్రాయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా పవన్ పై విమర్శలు పెరిగిపోతున్న నేపధ్యంలో పవన్ ఇమేజ్ పై దెబ్బ కొడుతున్న వ్యతిరేకులకు పోసాని కామెంట్స్ చెంపదెబ్బగా మారుతాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: