మాయాబజార్లో సావిత్రిలా..కీర్తి లుక్ అదిరిపోయింది..!
ఆ సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్ విడుదల చేస్తూ సినిమాపై మరింత ఆసక్తి నెలకొల్పుతోంది. మాయాబజార్ సినిమాలో సావిత్రిలా నటిస్తుండగా తీసిన ఫొటోలను తాజాగా కీర్తి సురేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అప్పట్లో సావిత్రి లుక్ని, ఇప్పటి కీర్తి సురేష్లుక్ని పక్కపక్కకు పెట్టి నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని మరికొన్ని స్టిల్స్ కూడా అలరిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని 'మహానటి' యూనిట్ ఇప్పటివరకూ బయటపెట్టలేదు.
సావిత్రి జీవితం మీద రీసెర్చ్ చేసే జర్నలిస్టు పాత్రలో సమంత నటించింది. ఆమెతో పాటు ఉండే ఫోటోగ్రాఫర్ పాత్రను విజయ్ దేవరకొండ పోషించారు. దుల్కర్ సల్మాన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు.
ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.
#MahanatiOnMay9th 😊 pic.twitter.com/C62D38ahG6— Keerthy Suresh (@KeerthyOfficial) May 5, 2018