దేశ వ్యాప్తంగా ‘బాహుబలి’ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తర్వాత హీరో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రబాస్ ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు అబుదాబీ లో జరుగుతుంది. అక్కడే కొన్ని ఫైట్ సీన్లు చిత్రీకరించారు.
అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో..బాలీవుడ్ లో సైతం చాన్సులు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనీ భావించాడు స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ కానీ రెమ్యునరేషన్ దగ్గర ఇద్దరికీ కుదరకపోవడంతో ప్రభాస్ ని వద్దనుకున్నాడు కరణ్ జోహార్ .
కట్ చేస్తే బాహుబలి 2 విడుదలయ్యింది అది కూడా సంచలన విజయం సాధించింది దాంతో ప్రభాస్ ని హీరోగా పెట్టుకుంటేనే మంచిదని భావించాడు కరణ్ జోహార్. అనుకున్నదే తడవు మరోసారి ప్రభాస్ ని సంప్రదించాడట..కానీ ఈ సారి కూడా ప్రభాస్ అగ్ర దర్శకుడికి నో చెప్పాడట. గతంలో రెమ్యూరేషన్ విషయంలో తేడా వస్తే..ఈ సారి ‘సాహో’ సినిమా షూటింగ్తో బిజిగా ఉన్నాడు.
ఆ తరువాత జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని మరో సినిమా అంగీకరించ కూడాదని భావిస్తున్నాడు ప్రభాస్. అందువల్లే మరోసారి కరణ్కు నో చెప్పాడు.