గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా అన్ని వర్గాల్లో ప్రముఖుల మరణం అభిమానులను కన్నీరు పెట్టిస్తున్నాయి. తాజాగా కన్నడ చలనచిత్ర రంగం వర్ధమాన దర్శకుడిని కోల్పోయింది. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చలనచిత్ర రంగానికి చెందిన వర్ధమాన దర్శకుడు సంతోశ్శెట్టి దుర్మరణం చెందారు.
2013లో విడుదలైన కన్నడ సినిమా ‘కనసు’ చిత్ర దర్శకుడైన సంతోశ్శెట్టి మరో ఐదుగురితో కలిసి బుధవారం ఉదయం బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ ఫాల్స్లో షూటింగ్కు వెళ్లారు. షూటింగ్లో భాగంగా సంతోశ్శెట్టి తన కాలికి బరువైన వస్తువు కట్టుకున్నాడు. దీంతో సడన్ గా వరదలు రావడంతో పరుగెత్తలేకపోయారు.
ఈక్రమంలో వరదప్రవాహంలో కొట్టుకుపోయారు. ఉదృతి తగ్గుముఖం పట్టినతరువాత అతనికోసం గాలించగా విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంతోశ్శెట్టి మృతి పట్ల కన్నవ పరిశ్రమ దిగ్భాంత్రిని వ్యక్తం చేసింది.