ప్రభాస్ అభిమానుల సెటైర్లకు అసహనంలో సాయి ధరమ్ తేజ్ !

Seetha Sailaja
మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ఒకప్పుడు వరస హిట్స్ ఇచ్చే హీరోగా పేరు తెచ్చుకుంటే ప్రస్థుతం కాలం కలిసిరాక వరస ఫ్లాప్ ల హీరోగా మారిపోయాడు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఈమెగా యంగ్ హీరో ఆశలు అన్నీ కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ‘తేజ్ ఐ లవ్ యు’ మూవీపై పెట్టుకున్నాడు. ఈసినిమా విడుదలకు ఇంకా చాలసమయం ఉన్నా ఈమూవీ పై క్రేజ్ తీసుకు రావడానికి తేజ్ మైకు పట్టుకుని పాట పడుతున్నట్లుగా ఉన్న పోస్టర్స్ ను విడుదలచేసి ఈమూవీ పై హైక్ తీసుకురావడానికి ఈమధ్య తన ట్విట్టర్ ద్వారా లైవ్ ఛాట్ లోకి వచ్చాడు. 

అయితే ఇక్కడ అనుకోకుండా తేజ్ కు ప్రభాస్ అభిమానుల నుండి సెటైర్లు ఎదురయ్యాయి. కరుణాకరన్ గతంలో ప్రభాస్ తో తీసిన ‘డార్లింగ్’ సినిమా తరహాలోనే ‘తేజ్ ఐ లవ్ యు’ లో సాయి ధరమ్ తేజ్ లుక్ ఉందని ప్రభాస్ అభిమానులు నేరుగానే తేజ్ ను టార్గెట్ చేసారు. దీనితో మనసులో ఏమనుకున్నాడో ఏమో కానీ తేజు మాత్రం చేతిలో గిటార్ మైకు ఉన్నంత మాత్రాన ప్రభాస్ ను అయిపోతానా అంటూ గిటార్ పట్టుకునే అర్హత ఒక్క ప్రభాస్ కే ఉందా అని ఎదురు ప్రశ్నలు వేసాడు. 

దీనితో మరింత రెచ్చిపోయిన అభిమానులు ‘కృష్ణార్జున యుద్ధం’ లో నాని వేసిన పాప్ సింగర్ పాత్రతో తేజుకు ముడిపెడుతూ కొత్త విశ్లేషణలు చేసారు. అయితే ఈకామెంట్స్ అన్నీ సాయిధరమ్ తేజ్ కు అసహనాన్ని కలిగించినా ఆవిషయాన్ని ఎక్కడా బయటపెట్టకుండా జాగ్రత్తగా ఆ ట్విటర్ లైవ్ ఛాట్ ముగించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఎన్నో మంచి చిత్రాలు తీసిన కేఎస్ రామారావు నిర్మిస్తున్న 45వ చిత్రంగా రూపొందుతున్న ఈమూవీ గ్యారంటీ హిట్ అని ఈ నిర్మాణ సంస్థ ప్రచారం చేస్తోంది. 

అయితే ప్రస్తుతం మెగా మేనల్లుడి క్రేజ్ తక్కువగా ఉన్న నేపధ్యంలో ఈమూవీ పై హైక్ పెంచడానికి ఈమూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు తేజ్ తన మామయ్య చిరంజీవిని తిరిగి అతిధిగా రంగంలోకి దింపుతున్నాడు.  తేజ్ చిన్న మామయ్య పవన్ కు కెరియర్ టర్నింగ్ ఇచ్చిన ‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ మూవీ కావడంతో పవన్ కు వచ్చిన అదృష్టం తనకు కూడ వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: