సాయిధరమ్ తేజ్ ఫంక్షన్ లో చిరంజీవి బయటపెట్టిన చరణ్ వ్యూహాలు !

Seetha Sailaja
వరస పరాజయాలతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ కెరియర్ కు అతడి లేటెస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్ యు’ అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు మొట్టమొదటి నుంచి హైక్ తీసుకు రావడానికి ఏకంగా చిరంజీవిని రంగంలోకి దింపారు. నిన్న రాత్రి జరిగిన ఈమూవీ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి నోటివెంట చరణ్ వ్యూహాలు బయటకు రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

ఈమూవీని నిర్మిస్తున్న క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ కు అదేవిధంగా ఈసంస్థ నిర్మాత కెఎస్ రామారావుకు తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి వివరిస్తూ చిరంజీవి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. మెగా స్టార్ అన్న టైటిల్ తనకు ఈసంస్థ నిర్మించిన సినిమాల ఘనవిజయం వల్ల వచ్చిందని అంటూ తన కెరియర్ లో ఈ సంస్థ సినిమాలకు ఉన్న ప్రాముఖ్యతను వివరించాడు. 

ఇదే సందర్భంలో ఈసంస్థ తనతో తీసిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ మూవీ పరాజయం గురించి మాట్లాడుతూ ఈ సంస్థ నిర్మాత కెఎస్ రామారావు ఆసక్తికనపరచకపోయినా తాను బలబంత పెట్టి ఆసినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ ను దర్శకుడుగా చేయడం వల్ల నిర్మాత రామారావు నష్టపోయిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు మెగా స్టార్. దీనితో తాను చేసిన పొరపాటు వల్ల కెఎస్ రామారావుకు కలిగిన నష్టాన్ని తీర్చుకునే అవకాశం తనకు తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ సంస్థ బ్యానర్ లో నటించడం వల్ల కలిగింది అంటూ తన వల్ల కలిగిన నష్టాన్ని తన మెగా అల్లుడు తీరుస్తాడు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు చిరంజీవి. 

ఇదే సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న మల్టీ స్టారర్ మూవీ నిర్మాణం పూర్తి అయ్యాక అతడి తదుపరి సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లోనే ఉంటుంది అని చెపుతూ తన వలన వచ్చిన నష్టాలను సాయి ధరమ్ తేజ్ పూర్తిగా తీర్చలేకపోతే ఆ బాధ్యతను చరణ్ తీసుకోబోతున్నాడు అన్న సంకేతాలు ఇచ్చాడు. దీనితో ఒకప్పుడు చిరంజీవి సూపర్ హిట్స్ సినిమాలకు చిరునామాగా కొనసాగిన క్రియేటివ్ కమర్షియల్స్ ఇక రానున్నరోజులలో వరసపెట్టి మెగా హీరోలతో సినిమాలు తీస్తుంది అన్న సంకేతాలు ఇచ్చాడు మెగా స్టార్..  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: