పవన్ కళ్యాణ్ కు దూరమైన తర్వాత ఒంటరి జీవితాన్ని భరించలేక రేణూ దేశాయ్ చాలా బాధ పడింది. తనకు తోడూ కావాలని కోరుకున్న రేణూ దేశాయ్ కి ఫైనల్ గా ఒక తోడు దొరికింది. అతనితో నిశ్చితార్ధం కూడా జరిగింది. రేణూ నిశ్చితార్ధం నాడు కొడుకు అకీరా , కూతురు ఆధ్య ఉన్న ఫోటో ను షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. నటి రేణూదేశాయ్ తన రెండో పెళ్లి గురించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, చేసిన ఓ పోస్ట్ లో తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్టు పేర్కొంది.
తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ దేశాయ్ చెయ్యేసిన ఫొటోలో ఎంగేజ్ మెంట్స్ రింగ్స్ ధరించి ఉండటం గమనించవచ్చు. బాధ నుంచి కోలుకునేందుకు తనకు సహాయంగా నిలిచిన నిజాయతీ మనసుకు ధన్యవాదాలంటూ తనకు కాబోయే భర్తకు థ్యాంక్స్ చెప్పింది. పవన్ ఫ్యాన్స్ నుంచి తనకు ఎక్కువగా అభినందనలతో పాటు సహకారం అందడంపై రేణు హర్షం వ్యక్తం చేసింది. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది రేణు దేశాయ్.
కాగా, విడాకుల అనంతరం పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకోగా, రేణు మాత్రం పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి పుణెలో నివసిస్తున్నారు. తన నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా రేణ బయటపెడుతున్నారు. జీవిత భాగస్వామి ఎవరు.. ఏంటి అన్న వివరాలపై రేణు దేశాయ్ స్పష్టత ఇవ్వకపోయినా.. ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్తో తెలిపారు.
ఇప్పుడు అందరూ రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరై వుంటారు అని చర్చించుకుంటున్నారు. “నా పిల్లలు నాతో లేకపోతే నా సంతోషానికి అర్థం లేనట్టే. నా జీవితంలో సంతోషకరమైన భాగాన్ని ప్రారంభిస్తున్న వేళ ఈ ఇద్దరూ పక్కనే ఉండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది” అంటూ పేర్కొంది.