నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 ఇప్పటికీ మూడు వారాలు పూర్తయ్యింది. మొదట సంజన తర్వాత నూతన్ నాయుడు మొన్నటి వారం నటుడు కిరీటి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే నాని చెబుతున్నట్లుగా ఇంకొంచెం మసాలా అంటున్నారు..అయితే ఆ మసాల ఇద్దరు జంటలతో మొదలైందా అని ప్రేక్షకులు అంటున్నారు. బిగ్ బాస్ హౌజ్లో ఏదైనా జరగొచ్చు అని నాని చెప్పినట్టుగానే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు.
అప్పుడే కోపం, ఆ వెంటనే శాంతం. ఇక బిగ్ బాస్ హౌజ్లో నడుస్తున్న ప్రేమాయణం గురించి చెప్పనక్కర్లేదు. తేజూ- సామ్రాట్, తనీష్- సునయనల మధ్య ఏదో నడుస్తుందని అందరు భావిస్తుండగా, వారు మాత్రం అదేమి లేదంటూ ట్రాక్ని పక్కదోవపట్టిస్తున్నట్టు అర్ధమవుతుంది. మొదటి నుంచి తేజస్వి ఇంటి సభ్యులతో ప్రతి విషయంలో రగడ చేస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె దీప్తిపై ఆరోపణ చేసింది. సోమవారం నాటి 23వ ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ మంగళవారం నాటి 24వ ఎపిసోడ్లోను కంటిన్యూ అయింది.
తమ గురించి నందిని తప్పుడు ప్రచారం చేస్తుందని తేజస్వీ ఆరోపించగా, అలాంటిదేమి లేదంటూ కన్నీటి పర్యంతం అయి చెప్పింది నందిని. ముఖ్యంగా తేజూ, నందినిల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరిందనే చెప్పవచ్చు. ఒకరి మీద ఒకరు పలు ఆరోపణలు చేసుకుంటుండగా, మిగతా ఇంటి సభ్యులు ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని ఎంతగానో ప్రయత్నించారు.
ఓట్ల కోసమే దీప్తి సునైనా తనతో క్లోస్గా ఉంటుందని, తనీష్ కూడా అందుకోసమే పిట్ట చుట్టూ తిరుగుతున్నాడని నందిని తనకు చెప్పినట్టు కిచెన్ వద్ద డిస్కషన్లో తేజస్వి వెల్లడించింది. దాంతో నందిని, తేజస్వి మద్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరుకోవడంతో నందిని బోరున ఏడ్చింది. ఆమెను దీప్తి, శ్యామల ఓదార్చారు.