టాలీవుడ్ లో బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో జాతీయ స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం సోషల్ మీడియాలో రాలేదు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు మాత్రం లీక్ అవుతున్నాయి. గతంలో ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ మాత్రం రిలీజ్ చేశారు. బాహుబలి తరువాత సాహో సినిమాతో బిజీగా ఉన్న యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు.
గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే కేకే రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి చిత్రం రూపొందనుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలిపారు. కె రాధాకష్ణ గతంలో తీసిన ‘జిల్' మూవీ నచ్చడం, అతడు చెప్పిన కథ ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ప్రభాస్ ఓకే చెప్పాడట.
ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ప్రభాస్ కెరీర్లో ఇది 20వ చిత్రం. సాహో షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో తదుపరి చిత్ర రెగ్యులర్ షూటింగ్ను త్వరలోనే ప్రారభించనున్నారు. ఎక్కువ భాగం యూరప్లో చిత్రీకరించినున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది.