టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘గీతాగోవిందం’సినిమా పైనే టాక్ నడుస్తుంది. చిన్న సినిమాగా థియేటర్లోకి వచ్చిన ‘గీతాగోవిందం’ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేరకొండ, రష్మిక మందన నటించిన ‘గీతాగోవిందం’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇప్పటికే 25 రోజులు పూర్తి చేసుకొని అర్థశతదినోత్సవానికి పరుగులు తీస్తుంది. అయితే ‘గీతాగోవందం’సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించడానికి చాలా మంది హీరోయిన్లను సంప్రదించానని..కానీ ఎవరూ ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదని..దర్శకుడు పరుశరామ్ అన్నారు..ఇదే విషయాన్ని ఓ ఫంక్షన్లో అల్లు అర్జున్ కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని చూసి అందరూ తెగ బాధపడిపోతున్నారు.
తాజాగా ‘గీతాగోవిందం’ అద్భుతమైన సినిమా మిస్ అయినందుకు తెగ బాధపడుతుంది..అనూ ఇమ్మాన్యుయేల్. తాజాగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ప్రమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ .. 'గీత గోవిందం' గురించి కూడా ప్రస్తావించింది. ఆ మద్య ‘గీతాగోవిందం’ సినిమాలో నటించమని నాకు పిలుపు వచ్చిందని..కానీ అప్పటికే అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య’ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నానని..షెడ్యూల్స్ టైమ్ కుదరకపోవడంతో ఆ సినిమా చేయలనేనిన చెప్పినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని చెప్పింది అనూ ఇమ్మాన్యుయేల్.
అదే సమయంలో 'శైలాజా రెడ్డి అల్లుడు' కూడా ఒప్పుకుని వున్నాను. అందువల్లనే 'గీత గోవిందం' చేయలేకపోయాను. అయితే ఈ సినిమాను నేను ఇంకా చూడలేదు..కాకపోతే ఈ సినిమా విజయం గురించి వింటుంటే..ఎంతో సంతోషం అనిపిస్తుంది. అదే సమయంలో నేను చేయలేకపోయానే అనే బాధ కూడా వుంది అని చెప్పుకొచ్చింది.