ఇప్పటి వరకు ఇండస్ట్రీలో జరగని ఓ విచిత్రం రేపటి వినాయక చవితి రోజు జరుగుతుంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో చైతూ సరసన నటించిన మాలీవుడ్ బ్యూటీ సమంత హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే వీరిద్దరూ రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కొంత కాలం ప్రేమించుకొని పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన రెండు నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత దంపతులు మళ్లీ షూటింగ్ బిజీల్ పడిపోయారు.
ఇక సమంత నటించిన మహానటి, రంగస్థలం,అభిమాన్యుడు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ రేపు విడుదల కాబోతుంది. విచిత్రం ఏంటంటే..అక్కినేని నాగచైతన్య, సమంత ఈ గురువారమే ఒకరి సినిమాతో మరొకరు పోటీపడుతున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఒకే రోజు చైతన్య సినిమా నా సినిమా విడుదల కావడంతో చిన్న ఒత్తిడి ఉంది. రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం యాదృశ్చికమేనని సమంత తెలియజేసింది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో భూమిక చావ్లా, ఆది పినిశెట్టి, రాహుల్ రవింద్రన్ కనిపించనున్నారు.మారుతి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా వినాయక చవితి సందర్భంగా రేపు విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ..తన భార్య సమంత నటించిన ‘యూటర్న్’ మూవీని కాకుండా ప్రేక్షకులు ముందుగా తన సినిమానే చూడాలని కోరారు. ఎందుకంటే ఈ యేడాదిలో నాకు ఇదే మొదటి సినిమా. ఇప్పటికే సమ్మూ తెలుగులో ‘రంగస్థలం’, ‘మహానటి’నటించి మంచి సక్సెస్ సాధించింది. కాబట్టి సమంత సినిమా కాకుండా నా సినిమానే ముందు చూడండి అంటూ నాగచైతన్య నవ్వుతూ అనడంతో ఈ క్యూట్ కపుల్స్ తమల పట్ల ఎంత కమిట్ మెంట్ ఉందో తెలుస్తుంది.