నాగార్జున నానీలు కలిసి నటిస్తున్న ‘దేవదాస్’ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా అటు నాగార్జున ఇటు నాని ఈవిషయాన్ని తమ ట్విట్టర్ లో అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడమే కాకుండా వారిద్దరూ వేరువేరుగా చెరో గ్రూప్ ఫొటో షేర్ చేశారు. ఈ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే నాగ్ ప్రకటనతో నానీ తెరిపిన పడ్డాడు అంటూ కామెంట్స్ వచ్చాయి.
వాస్తవానికి ఇలాంటి కామెంట్స్ రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ఈమధ్య కాలంలో నాగార్జున సినిమా అంటే రీషూట్ ఉండాల్సిందే. అది నాగ్ మూవీ కావొచ్చు కొడుకులు చైతన్య అఖిల్ సినిమాలు కావొచ్చు. తనకు నచ్చకపోతే రీషూట్ చేయమని చెప్పడమే కాకుండా ఈవిషయమై నాగార్జున ఆమూవీ దర్శకుడి పై చాల ఒత్తిడి చేస్తాడు అన్న మాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
ఈనేపధ్యంలో ‘దేవదాస్’ మూవీ రీ షూట్ ప్రమాదం నుండి తప్పించుకుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ‘దేవదాస్’ సినిమాను కూడ నాగార్జున పూర్తిగా చూసినప్పటికీ అక్కడక్కడ కొన్ని మార్పులు చెప్పాడు కానీ పూర్తిగా కొన్ని సీన్స్ తీసివేసి మళ్ళీ రీ షూట్ చేయమని సలహాలు ఇచ్చినట్లు తెలియడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.
తన అలవాటుకు భిన్నంగా ఈసారి నాగార్జున కేవలం ఈసినిమా విషయంలో చిన్న మార్పులు మాత్రమే చెప్పడం ఇండస్ట్రీ వర్గాలలో చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో నాగార్జ్జున తీరు మారిందా లేదంటే నానీకి భయపడి నాగ్ తన తీరు మార్చుకున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి..