నేడు వినాయక చవితి పండుగ..ఈ పండుగ ప్రత్యేక ఏంటో తెలుసా..తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ జోరు కొనసాగుతుంది..అక్కినేని నాగ చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆయన సతీమణి అక్కినేని సమంత నటించిన ‘యూటర్న్’. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినీ తారలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు..అయితే వారి చిత్రాలు ఒకేసమయంలో రిలీజ్ అయిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజు అక్కినేని నాగ చైతన్య, సమంత లు నటించిన చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.
మొదటి నుంచి ఈ చిత్రాలపై విపరీతమైన క్రేజ్ పెంచుతూ వచ్చారు. కన్నడ రిమేక్ గా ‘యూటర్న్’ తెరకెక్కించగా..కామెడీ దర్శకులు మారుతి ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. అటు "శైలజారెడ్డి అల్లుడు".. ఇటు "యు టర్న్" చిత్రాలతో థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇప్పటికే రెండు చిత్రాల ప్రీమియర్స్ యుఎస్లో పడిపోయాయి. ఇక ఈ చిత్రంలో మారుతి మార్క్ పెద్దగా కనిపించలేదని అంటున్నారు. ఫ్లాట్ స్టోరీ..గతంలో చూసినట్లు కనిపిస్తుందట.. ఎక్కడా కొత్తదనం లేకుండా ఉన్న ఈ చిత్రం కేవలం అక్కడక్కడా కాస్త కామెడీతో మాత్రమే నెట్టుకొచ్చిందని చెబుతున్నారు అభిమానులు.
రమ్యకృష్ణ.. నాగచైతన్య ఇమేజ్తో సినిమా ఆడితే ఆడాల్సిందే కానీ మ్యాటర్ అయితే తక్కువే ఉందంటున్నారు. సమంత నంటించి ‘యూటర్న్’ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఓ మర్డర్ మిస్టరీకి సంబంధించింది..ఇందులో విలేఖరిగా సమంత అద్భుతంగా నటించిందట. ముఖ్యంగా దర్శకుడు పవన్ కుమార్ గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే "యు టర్న్"కు కలిసొచ్చే అంశం. పైగా రన్టైమ్ కూడా తక్కువగానే ఉండటంతో జనాలకు బోర్ కొట్టకుండా ఉందంట. మొత్తానికి "శైలాజరెడ్డి అల్లుడు" జస్ట్ యావరేజ్ టాక్తో వస్తుంటే.. "యు టర్న్" మాత్రం మంచి టాక్తోనే వస్తుంది. రేపటి వరకు వచ్చే కలెక్షన్లను బట్టి ఏ సినిమా హిట్ అవుతుందో..ఏ సినిమా ఫట్ అవుతుందో చూడాలి.