ఈ మద్య టాలీవుడ్ లోకి మాలీవుడ్ నుంచి వస్తున్న హీరోయిన్లు వరుస విజయాలు అందుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే త్రిష, నయనతార పలువురు హీరోయిన్లు స్టార్ హోదాలో ఉంటే..తెలుగు లో కీర్తి సురేష్, సాయి పల్లవి మరికొంత మంది హీరోయిన్లు బాగా రాణిస్తున్నారు. రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ తర్వాత నేను లోకల్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది కీర్తి సురేశ్ కి బాగా కలిసొచ్చింది.
తెలుగులో ఆమె చేసిన 'మహానటి' ఆమెకి విజయంతో పాటు ప్రశంసలు తెచ్చిపెట్టింది. తమిళంలో చేసిన 'పందెం కోడి 2' .. 'సర్కార్' అక్కడ భారీ విజయాలను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కీర్తి సురేష్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే 'మహానటి' తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన కథలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయట. కానీ స్టార్ హీరోల సరసన నటిస్తేనే తనకు మంచి క్రేజ్ వస్తుందని భావించిన కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోలపై ఫోకస్ పెట్టింది.
ఇక టాలీవుడ్ లో ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రలలో క్రేజీ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండగా నవంబర్ 18న ఈ సినిమా తొలి షెడ్యూల్ మొదలు కాగా,రీసెంట్గా కంప్లీట్ అయ్యింది. జనవరిలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ ( రామ రావణ రాజ్యం) అనే టైటిల్తో ప్రచారం జరుపుకుంటుండగా, చిత్ర కథ రామాయణం ఇతి వృత్తంగా ఉంటుందని అంటున్నారు.
ఇందులో రామ్చరణ్ రాముడిగానూ, జూనియర్ ఎన్టీఆర్ రావణుడిగానూ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాంచరణ్ సరసన అంటే సీత పాత్రలో కీర్తి సురేష్ నటించబోతున్నట్టు టాక్. మరో పాత్రలో రష్మిక మందన నటిస్తుంది. సెంబర్ 12న సినిమాకి సంబంధించి భారీ ఎనౌన్స్మెంట్ వస్తుందని తెలుస్తుండగా, ఆ రోజు ఏం ప్రకటిస్తారో చూడాలి.