"చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొన్నాడా?"

వర్తమాన రాజకీయాలు వక్రించిన సందర్భంలో,  రాజకీయ నాయకుడుగా ఉద్భవించిన, ఒక కమేడియన్ యాక్టర్ ఇప్పుడు ఊసుపోకకు పూర్తి స్థాయి విషయంగా మారి పోయాడు పాపం! 


గన్నవరం మండల పరిధిలోని ఒక అపార్ట్మెంటులో ప్లాట్లకొనుగోలు కోసం, సబ్-రిజిస్టార్ కార్యాలయానికి వచ్చిన హాస్యనటుడు, వివాదాస్పద రాజకీయ నాయకుడు, టిడిపి మద్దతు దారుడు, పచ్చ మీడియా ప్రాణ ప్రియుడుగా కనిపించిన శొంఠినేని శివాజి, మీడియాపై (పచ్చ మీడియా కాకపోవచ్చు) తీవ్రస్థాయిలో మండిపడ్డారట.

ఆయన ఎంత జాగ్రత్తగా మీడియా కంట పడకుండేందుకు ప్రయత్నం చేసినా మీడియా ఆయనను కనిపెట్టింది వదలకుండా వెంటబడింది. అసలే మీడియా హచ్ కుక్క కదా! దట్ ఫాలోస్ విత్ ఇట్స్ టార్గెటెడ్ సబ్జెక్ట్ - ఈ సందర్భంగా తనను అనుసరించి ప్రశ్నలు సంధిస్తున్న మీడియా ప్రతినిధులపై శివాజీ చిందు లేశారట ఆపై మండి పడ్డారట కూడా! 


గత కొంతకాలం క్రితం "ఆపరేషన్ గరుడ రాక్షస కుమార ద్రవిడ " అదీ ఇదీ అంటూ కేంద్రంలోని అధికార బిజేపిని అల్లరి పాలు చేసి, మీడియా ముందు హడావిడి చేసిన సంగతి తెలిసిందే. దానికి చంద్రబాబు నాయుడే కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం చేశారని ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత శివాజి మాయమై అమెరికా పోయొచ్చి  మీడియా కు కనిపించకుండా పోయారు. ఇప్పుడు తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.

"రాస్తే రాసుకోండి.. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారు. అంతేగా!" అంటూ మండి పడ్డారట. ఫోటోలు, వీడియో లు తీస్తే బాగోందంటూ, సహించనంటూ మీడియా ప్రతినిధులను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకొని వెంటనే కారులో వేగంగా వెళ్లిపోయారట. శివాజీని మీడియా ప్రతినిధులు మొబైల్ తో ఫోటోలు తీస్తే, వారిని వెంబడించి బెదిరించి మరీ, ఆ ఫోటోలను కూడా డిలీట్ చేయించారట.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: