ఆ సమయంలో చాలా బాధ అనిపించేది : రాంచరణ్

siri Madhukar
గత సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లో రూ.200 కోట్ల క్లబ్ లో నిలబెట్టింది.  దాంతో అప్పటి వరకు రాంచరణ్ 60 కోట్ల బిజినెస్ నుంచి మినిమం 150 కోట్ల బిజినెస్ కి చేరుకోవడంతో అంచనాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. రాంచరణ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమా నిర్మితమైంది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.  ముఖ్య అతిథులుగా కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు.  ఈ సందర్బంగా రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించింది.  ఈ సినిమాలో హాలీవుడ్  రేంజ్ లో ఫైట్స్ కనిపించడంతో మెగా అభిమానుల సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉన్నారు. 

తాజాగా రాంచరణ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని.. కొన్ని సన్నివేశాల్లో ఒంటినిండా టాటూతో కనిపిస్తాను. అది స్టిక్కర్లతో వేసిన టాటూ .. అది వేయడానికి 2 గంటలు .. తీయడానికి గంటన్నర సమయం పట్టేది. ఆ స్టిక్కర్ తీసేటప్పుడు చాలానొప్పిగా ఉండేది .. అయినా అలాగే భరించానని అన్నారు. ఇక సినిమాలో నా సహనటి కైరా అద్వాని మంచి డాన్సింగ్ పార్ట్నర్ గా అనిపిస్తోందని..గతంలో తమన్నాతో నటించినపుడు ఆ ఫీలింగ్ ఉండేదని రాంచరణ్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: