టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఇప్పటి వరకు పలువురు సీనియర్, జూనియర్ హీరోలతో సినిమాలు నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు లు హీరోలుగా పరిచయం అయ్యారు. రమేష్ బాబు నిర్మాతగా కంటిన్యూ అయ్యారు..ఇక టాలీవుడ్ లో మహేష్ బాబు నెంబర్ వన్ రేస్ లో కొనసాగుతున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించినా..పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయారు.
ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడని ఆ మద్య వార్తలు వచ్చాయి. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం చేయబోతున్నట్లు దిల్ రాజు తెలియజేశారు. కానీ ఇప్పుడు గల్లా అశోక్ ని తప్పించి మరో హీరో రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే మహేష్ బాబు అల్లుడైన గల్లా అశోక్ కోసం కథ రెడీ చేసి ఇప్పుడు రాజ్ తరుణ్ తో తీయడం ఏంటా అన్న అనుమానాలు వచ్చాయి..దానికి దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ కథ కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యే హీరోకు సరిపోదని.. ఆ కథ రాజ్ తరుణ్ కు అయితే బాగుంటుంది అందుకే ఈ మార్పు అని అన్నారు. అయితే గల్లా అశోక్ కి మరో కథ సెట్ చేయడానికి చూస్తున్నాడట దిల్ రాజు . ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే దిల్ రాజు బ్యానర్ లో లవర్ అనే సినిమాని తీసాడు. ఈ సినిమా డిజార్టర్ అయినా కథా పరంగా ఈ సినిమా రాజ్ తరుణ్ అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట అందుకే మహేష్ అల్లుడ్ని తీసేసారు అదీ విషయం.