భారతీయ చలన చిత్రంలో సూపర్ స్టార్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు రజినీకాంత్. అరవై ఏళ్ల వయసు ఉన్నా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. రజినీ చిత్రం వస్తుందటే చాలు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. గత యేడాది శంకర్, రజినీ కాంబినేషన్ లో వచ్చిన 2.0 సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన పెట్టా కూడా మంచి హిట్ అయ్యింది. తాజాగా రజినీకాంత్ స్టార్ దర్శకులు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రజినీ సరసన స్టార్ హీరోయిన్లు నయన తార, కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. నయనతార గతంలో రజనీతో కలిసి చంద్రముఖి, కథానాయకుడు చిత్రాలు చేసింది. కాని కీర్తి ఇప్పటి వరకు రజనీకాంత్తో ఒక్క చిత్రం చేయలేదు.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న సమాచారం. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.