ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది : యాంకర్ రష్మి

Edari Rama Krishna
జబర్ధస్త్ కామెడీ షో లో హాట్ యాంకర్ అనసూయ తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన రష్మి మంచి ఫామ్ లో కొనసాగుతుంది.  ప్రస్తుతం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా రాణిస్తుంది. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది.  బుల్లితెర యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న రష్మి టీవీ షోలతో బిజీగా గడుపుతోంది.

ఈ మద్య రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది.  తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె షూటింగ్ కోసం స్టూడియోకి వెళ్లగా.. అక్కడ బయట ఒక కుక్కపిల్లని చూసిందట. ఈ పప్పీకి వైద్యసాయం కావాలి.

నేను షూటింగ్ చేస్తున్న స్టూడియో బయట దీనిని నేను చూశాను. జంతువుల పట్ల మనుషులు చూపిస్తున్న నిరాదారణ నన్ను కలచివేసింది. దయచేసి సాయం చేయండి'' అంటూ పోస్ట్ పెట్టింది.మరికాసేపటికి ఆ పప్పీని తాను హాస్పిటల్ కి తీసుకెళుతున్నట్లు చెప్పింది.
Need urgent medical aid for this puppy, came to my notice just today at the studio where I shoot
Extremely disheartened by the lack of response from #peopleforanimals
Kindly help and tag necessary people for urgent help #thanks pic.twitter.com/DJBw3iRn3p

— rashmi gautam (@rashmigautam27) March 1, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: