మహేష్ బాబు ఫాన్స్ పండగ చేసుకునే వార్త
ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, షూటింగ్కు కాస్త గ్యాప్ ఇచ్చి ఓ యాడ్ ఫిలిం షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ యాడ్ ఫిలింకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.గతంలో మహేష్ హీరోగా అతడు, ఖలేజా లాంటి సినిమాలను తెరకెక్కించిన త్రివిక్రమ్ పలు యాడ్స్ను కూడా డైరెక్ట్ చేశాడు. గతంలో ఏడాది కి మూడు సినిమాలు చేస్తూ ప్లాపులతో కురుకోపోయాడు.
ఇప్పుడు అంత దూకుడుగా కాకుండా కాస్త ఆలోచించి ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు.తాజాగా మరోసారి త్రివిక్రమ్తో కలిసి పనిచేయటంపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు మహేష్. ‘నా ఫేవరెట్తో మరోసారి. ఈ అనుభవం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి మే 9 ప్రేక్షకుల ముందుకు రానుంది.మరి ఈసారి హిట్లు అందుకొని అగ్రస్థానంలో నిలుస్తాడా లేదా చూడాలి. పవన్ కల్యాణ్ సినిమాలు మానేయడం అనేది మహేష్ కు కాస్త ప్లస్ కావొచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పుడు కలెక్షన్ల పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి.