టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా ఏపి ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారు. ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్ పై ఆంధ్రప్రదేశ్ లో రగడ కొనసాగుతూనే ఉంది. ఏపిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో సీఎం చంద్రబాబును కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు మొదటి నుంచి అభ్యంతరం తెలియజేస్తూ వస్తున్నారు..కోర్టుకెక్కారు. దాంతో ఈ సినిమా ఏపిలో తప్ప తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.
అప్పటి నుంచి ఏపిలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మే 1న ఏపీలో ఈ సినిమా రిలీజవుతుందని.. ఎన్టీఆర్ వెన్నుపోటు వెనుక కుట్రలు ఎలా జరిగాయో తెలుసుకోండి అంటూ ట్విట్టర్లో పిలుపు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తనను విజయవాడ నుంచి బలవంతంగా పంపించేయడంపై రామ్ గోపాల్ వర్మ మండిపడుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వస్తే ఏ కారణాలతో తనను హైదరాబాద్ తిప్పి పంపారో చెప్పాలని నిలదీస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన చంద్రబాబునాయుడు, విజయవాడ పోలీసులకు తాను 16 ప్రశ్నలు సంధిస్తున్నానని, వాటికి 16 గంటల్లోగా జవాబు చెప్పకపోతే కోర్టుకెళ్లి తన హక్కులు సాధించుకుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా వర్మ తన 16 ప్రశ్నలను ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశారు. నా కారు ఆపాల్సిన అవసరం ఏంటి? తమకు ఆదేశాలున్నాయని పోలీసులు అంటున్నారు, ఆ ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలి? వంటి ప్రశ్నలు తన పోస్టులో ప్రస్తావించారు
JAI TDP DEMOCRACY 🙏🙏🙏 pic.twitter.com/8LPFGQx3am— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2019
I AM DEMANDING ANSWERS FOR 16 QUESTIONS FROM @ncbn AND THE VIJAYAWADA POLICE ..IF I DO NOT GET ANSWERS TO MY 16 QUESTIONS WITHIN 16 HOURS I WILL GO TO COURT! ..Check this link for the 16 questions https://t.co/ZmDTiBAPd0— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2019