పవన్ పై నిఖిల్ లెక్కలకు షాక్ లో రాజకీయ వర్గాలు !

Seetha Sailaja
యంగ్ హీరో నిఖిల్ కు సామాజిక స్పృహ ఎక్కువ. దీనితో సోషల్ మీడియాలో అనేక సామాజిక రాజకీయ విషయాల పై నిఖిల్ స్పందిస్తూ సందడి చేయడం అతడి అలవాటు. ఇలాంటి సందర్భంలో నిఖిల్ సోషల్ మీడియాలో తన అభిమానులతో ఛాట్ చేస్తున్నప్పుడు అతడి లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సురవరం’ ప్రస్తావన వచ్చింది.

ఈ సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడినందుకు బాధగా ఉందా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సరదాగా సమాధానం ఇస్తూ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయ నాయకులు పడుతున్న ఎన్నికల ఫలితాల టెన్షన్ ముందు తన సినిమా టెన్షన్ చాల చిన్నది అంటూ కామెంట్స్ చేసాడు. అదేవిధంగా ఎన్నికల ఫలితాల పై వస్తున్న ఊహాగానాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

తాను పవన్ వీరాభిమానిని అని చెపుతూ పవన్ కళ్యాణ్ సినిమా 100 రోజులు ఆడి చాల సంవత్సరాలు అయిందనీ అందువల్ల రాబోతున్న ఎన్నికల ఫలితాలలో 100 సీట్లు రావాలని కోరుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు చంద్రబాబు సమర్ధవంతమైన నాయకుడనీ జగన్ అనునిత్యం జనం మధ్య ఉంటూ కాలం గడిపే నిజమైన మాస్ లీడర్ అని అంటూ వీరిద్దరి పై కూడ ప్రశంసలు కురిపించాడు. 

దీనితో రాబోతున్న ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రి రేసులో ఉన్న జగన్ చంద్రబాబు పవన్ ల మధ్య సమన్యాయం పాటిస్తూ నిఖిల్ చాల తెలివిగా ఇలా ఈ ముగ్గురి పై కామెంట్స్ చేసాడు అనుకోవాలి. పవన్ కు 100 సీట్లు రావాలి అని కోరుకోవడం ద్వారా తన ‘అర్జున్ సురవరం’ మూవీకి పవన్ అభిమానుల పరోక్ష సహకారం చాల తెలివిగా అడుగుతున్నాడనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: