ఈ మద్య టాలీవుడ్ లో ఎక్కువగా మల్టీస్టారర్ మూవీలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’సూపర్ డూపర్ హిట్ అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అన్నదమ్ముల అనుబంధం, తల్లిదండ్రుల ఎమోషన్స్ ఎంతో చక్కగా చూపించారు. అయితే ఈ సినిమాలో హీరోలకు పేర్లు ఉండవు..చిన్నోడు, పెద్దోడు అనే పిలుస్తారు. సినిమా మొదలు ఎండింగ్ వరకు ఎక్కడా పేర్లు వినిపించవు. ప్రస్తుతం మహేష్ బాబు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు చిత్ర యూనిట్. అయితే ఈ మూవీపై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిలుగా ఎన్టీఆర్, రాంచరణ్ లు వస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అఫిషియల్ గా ఏ ప్రకటన రాలేదు. కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా ఆ విషయాన్ని రివీల్ చేసింది. విక్టరీ వెంకటేష్ మహర్షి మూవీ కి ముఖ్య అతిధిగా రానున్నారంటూ ప్రకటించింది. వెంకటేష్తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో సందడి చేయనున్నారు.
నాగ చైతన్యతో ‘వెంకీ మామ’మల్టీ స్టారర్ సినిమాతో బిజీగా ఉన్న వెంకటేష్ ఇటీవలి కాలంలో విడుదలైన సూపర్ హిట్ మూవీలు మజిలీ, జెర్సీ ప్రీ రిలీజ్ వేడుకకి గెస్ట్గా హాజరయ్యారు. ఇప్పుడు మహర్షి చిత్రానికి కూడా వెంకీనే గెస్ట్గా హాజరు కానుండడంతో ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. దిల్ రాజు, అశ్వినీ దత్ పివీపీ సంయుక్తంగా నిర్మించిన మహర్షి చిత్రంకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే.