కంటతడి పెట్టిన జూనియర్ ఎన్టీఆర్..?
ఇంతగా అభిమానులను ప్రేమించే తారక్ తన అభిమాని కృష్ణా జిల్లా వాస్తవ్యులు జయదేవ్ అనే అభిమాని చనిపోవడంతో తీవ్ర నిరాశకు భావోద్వేగానికి గురై ఫేస్ బుక్ వేదికగా ఓ లేఖను రాసారు ఎన్టీఆర్. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. “నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.
`నిన్ను చూడాలని` చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడి గా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో.. నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ని తెలుపుతున్నాను“ అని లేఖ రాసారు.