దాసరి కుమారుడు మిస్సింగ్..? అసలేం జరిగింది..?

Chakravarthi Kalyan
దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు కనిపించడం లేదు. ఆయన ఈనెల 9 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరోజు ఇంటి నుంచి ఆ రోజు బయటకు వెళ్లిన ప్రభు ఇంతవరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని జూబ్లి హిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు.


అయితే ప్రభు ఇలా అదృశ్యం కావడం ఇదే తొలిసారి కాదు. దాదాపు పదేళ్ల క్రితం కూడా ఒకసారి ఇలాగే ప్రభు కొన్ని రోజలపాటు కనిపించడకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన తన భార్య తనను కిడ్నాప్ చేయించిందని చెప్పారు. పదేళ్ల తర్వాత ఆయన మరోసారి మిస్ అవ్వడం కలకలం రేపుతోంది. 

దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన  ఆస్తుల కోసం కుటుంబంలో వివాదాలు ఉన్నాయని పలు వార్తలు వచ్చాయిు. గతంలో ఈ విషయాలు పత్రికలకూ ఎక్కాయి. కొన్నాళ్లుగా అవి సద్దుమణిగాయి. ఇప్పుడు ప్రభు మిస్సింగ్ తో మరోసారి తెరపైకి వచ్చాయి. 

ఈసారి ప్రభు మిస్సింగ్ కు దారి తీసిన పరిస్థితులేంటనేది పోలీసుల దర్యాప్తులో కానీ వెల్లడయ్యే అవకాశం లేదు.  కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలు కారణంగానే ఈ తాజా పరిణామం జరిగి ఉండొవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: