రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు సినిమాల కోసం ఇబ్బంది పడింది.
హిందీలో దే దే ప్యార్ దే సినిమా హిట్ కొట్టిన తరువాత రకుల్ దశ
తిరిగిపోయింది. టాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. అందులోను
రకుల్ ప్రీత్ హీరోయిన్. సూర్య హీరోగా చేసిన ఎన్జీకే సినిమాలో నటించింది.
కానీ,
ఈ సినిమా బెడిసికొట్టడంతో పాపం రకుల్ ఇబ్బంది పడింది. ఇటు టాలీవుడ్ లో
మన్మధుడు 2 లో చేస్తున్నది. నిన్న రిలీజైన ఈ సినిమా టీజర్ అదరహో అనిపించే
విధంగా ఉండటంతో సినిమాపై ఆశలు పెరిగాయ్. తప్పకుండా మరో హిట్ అవుతుందని
నమ్మకం ఏర్పడింది.
రకుల్ తమిళంలో మరో సినిమా
ఆఫర్ వచ్చినట్టు సమాచారం. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో 63 వ సినిమా
తెరకెక్కుతోంది. చాలా వరకు సినిమా కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా తరువాత
రకుల్ లోకేష్ కనగల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.
ఈ
సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. దర్శకుడు
లోకేష్ ఇప్పటికే రకుల్ ను సంప్రదించి దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది.
విజయ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఇప్పటికి అవకాశం
దొరికింది.