కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న శ్రీ రెడ్డి తాజాగా రిలీజ్ అయిన దొరసాని సినిమాను టార్గెట్ గా చేసుకుని మళ్ళీ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.... జీవిత రాజశేఖర్ దంపతుల కుమార్తె శివాత్మిక డెబ్యూ మూవీగా తెరకెక్కిన దొరసాని రీసెంట్గా రిలీజ్ అయ్యి థియేటర్లలో నడుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో ఇండస్ట్రీ పై జీవిత చేసిన కామెంట్స్ ను టార్గెట్ గా చేస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు దొరసాని సినిమా పై సెటైర్లు వేసింది.
‘సినిమాల్లో లిప్ లాక్లు ఒకరి మీద ఒకరు పడటాలు ఎక్కువైపోతున్నాయి.. బెడ్ రూంలో చేయాల్సిన పనులు రోడ్ మీద చేస్తామా’ అంటూ జీవిత చేసిన కామెంట్స్ని గుర్తు చేస్తూ నాటి వీడియోను షేర్ చేసింది. ‘జీవిత గారూ ఇది మీకు గుర్తుందా’ అంటూ ఈ వీడియో వదిలింది శ్రీరెడ్డి. ఇక మరో పోస్ట్లో దొరసాని సినిమాను కూడా టార్గెట్గా చేసుకుంది.
దొరసాని సినిమా హిట్టా? ఫ్లాపా? శివాత్మిక రాజశేఖర్ని కిస్ చేశాడట ఆనంద్ దేవరకొండ. ఈ టాపిక్పై ఫేస్ బుక్ లైవ్లోకి వస్తున్నా అని మరో సంచలనానికి రెడీ అవుతున్నానని సవాల్ చేసింది. ‘జీవిత గారు నీ కూతురు దగ్గరకి వచ్చేసరికి ఎన్ని పత్తిత్తు కబుర్లు చెప్తున్నారో ఒకసారి తవ్వుకుందాం .. మీరెలాగూ మూవీ అసోషియేషన్ కార్డుకి అడ్డం పడుతున్నారని తెల్సు.. స్టిల్ మాట్లాడతా’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ఏదేమైనా శ్రీరెడ్డి తాజా ట్వీట్లు చూస్తే ఆమె మళ్లీ రచ్చకు రెడీ అవుతోందని తెలుస్తోంది.