మహేష్ బాబుకు సినిమా తప్పించి మరే ప్రపంచం తెలియదు. అలాంటి మహేష్ బాబుకు క్రికెట్ అంటే పిచ్చి. బాగా చూస్తాడు. అందుకే ఫ్యామిలీతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ఇండియా... పాక్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూశారు. క్రికెటర్లతో ఫోటోలు దిగారు. అలాంటి మహేష్ బాబు రీసెంట్ గా ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ అందరిని ఆకట్టుకుంది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. రెండు జట్ల స్కోర్ సమానంగా ఉండటంతో.. మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు సాగింది. అక్కడ కూడా టై కావడంతో మ్యాచ్ లో ఎక్కువ ఫోర్లు కొట్టిన ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. అది చాలామంది నచ్చలేదు.
ఎందుకంటే మ్యాచ్ టై అయితే, ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తే బాగుండేది. ఇదే అభిప్రయాన్ని చాలామంది ట్వీట్ చేశారు. టాలీవుడ్ సెలెబ్రిటీ మహేష్ బాబు కూడా ఈ ఫైనల్స్ పై ట్వీట్ చేశారు. రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి. ఫైనల్ గా ఇంగ్లాండ్ ను విజయం వరించింది.
కానీ, న్యూజిలాండ్ కోట్లాది మంది మనసులను గెలుచుకుంది... అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూజిలాండ్ వీరోచిత పోరాటానికి అందరు ఫిదా అవుతున్నారు. ఇంగ్లాండ్ కు కప్ ఇవ్వడం న్యూజిలాండ్ చేసిన త్యాగంగా చెప్పుకోవచ్చు.