మహేష్ బాబు మహర్షి తరువాత చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా కాశ్మీర్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. కామెడీ ప్రధానాంశంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 26 నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నది.
ఇది లాంగ్ రన్ షెడ్యూల్. ట్రైన్ సెట్స్ లో సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. వెంకీ సినిమా తరహా కామెడీ ఇందులో ఉండబోతున్నట్టు సమాచారం. మహేష్ బాబు సీరియస్ పాత్రలు చేయడంలో దిట్ట. కామెడీ చేయగలడు. టైమింగ్ కామెడీ ఉంటుంది. మహేష్ బాబు టైమింగ్స్ కు తగ్గట్టుగా కామెడీ సీన్స్ ఉంటాయా అన్నది చూడాలి.
మహేష్ కోసం అనిల్ రావిపూడి పంచ్ తో పాటు అనుకున్నట్టుగా టైమింగ్ కామెడీని సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. తప్పకుండా వీరి కామెడీ వర్కౌట్ అవుతుందని అంటున్నారు. అభిమానులు కోరుకున్నట్టుగా అన్ని రకాల మసాలాలు ఉంటాయట.
రష్మిక మొదటిసారి మహేష్ తో చేస్తున్నది. ప్రస్తతం ఈ అమ్మడు డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యాక పూర్తి స్థాయిలో మహేష్ సినిమాకు అందుబాటులో ఉంటుంది. విజయశాంతి కీలక పాత్ర చేస్తుండటం విశేషం.