ఇప్పటికే తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారమైన బిగ్ బాస్ రెండు సీజన్లు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో అందరికి తెలిసిందే. ఒక సీజన్ ను మించి మరొకటి మంచి ప్రేక్షకాధరణతో అలానే అద్భుతమైన టిఆర్పి రేటింగ్స్ తో ఎంతో విజయవంతం అవ్వగా, ప్రస్తుతం మంచి ఉత్కంఠత మధ్య సాగుతున్న మూడవ సీజన్ కూడా మంచి రేటింగ్స్ సంపాదిస్తోంది. ఇక నిన్నటి బిగ్ బాస్ హౌస్ లోకి సడన్ గా పోలీసులు ఎంటర్ అయ్యారు అనే వార్త బిగ్ బాస్ యాజమాన్యంలోను, అలానే ప్రేక్షకుల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే పోలీసులు ఎంటర్ అయింది తెలుగు బిగ్ బాస్ షో లోకి కాదు,
ప్రస్తుతం మంచి రసవత్తరంగా సాగుతున్న తమిళ బిగ్ బాస్ షో లోకి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ గేమ్ షోలో పాల్గొన్న నటి మీరా మిథున్ ఇటీవల దక్షిణ భారత అందాల పోటీలను నిర్వహించదలచి పోలీస్కేసుల వరకూ వెళ్లి వివాదాల నటిగా పేరు తెచ్చుకున్న విషయం విపరీతంగా వైరల్ అయింది. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె, ఒక వ్యక్తికి అందాల పోటీలకు డిజైనర్గా అవకాశం ఇస్తానని చెప్పి అతడి నుండి రూ.50 వేలు డబ్బు తీసుకుని మోసం చేసిందని, ఆ వ్యక్తి తేనంపేట పోలీస్స్టేషన్లో మీరా పై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకుందట మీరా మిథున్. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో ఉన్నానని, బయటకు రాగానే తనపై కేసును చట్టపరంగా పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆమె పేర్కొనడం జరిగింది.
దీంతో ఆమెకు ముందస్తు బెయిల్ను కోర్టు మంజూరు చేయడంతో ఊపిరి పీల్చుకుంది. కానీ నిన్న గురువారం సడన్ గా పోలీసులు మీరామిథున్ను విచారించడానికి బిగ్బాస్ హైస్లోకి ప్రవేశించడంతో, ఆమె అరెస్ట్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆమె అరెస్ట్ చేసే విషయాన్ని పోలీసులు నిర్దారించలేదని సమాచారం. ఇక ఈ షాకింగ్ ఘటనతో బిగ్ బాస్ యాజమాన్యం వారు కొంత ఆందోళనలో పడ్డారట. అంతేకాక షో ఆగిపోనుందా అంటూ పలు మీడియా మాధ్యమాల్లో అప్పుడే వార్తలు పుకారవుతున్నాయి. మరి మున్ముందు ఈ విషయమై ఏమి జరుగుతుందో అని తమిళనాడు ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు....!!