సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై దిల్రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ నిర్మించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి మహేష్ ఖాతాలో ఒక మంచి హిట్ చేర్చింది.
ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ మరో కీలక పాత్ర పోషించి యూనివర్సల్ కాన్సెప్ట్తో, రైతు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందరి మనసుల్ని గెలుచుకుంది. ఈ సినిమా చూసిన ఎంతో మంది ప్రముఖులు మహేష్ ను పొగడ్తల ట్వీట్ ల ముంచెత్తారు.
తాజాగా ఈ సినిమా చూసిన ఒక ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన వాల్ పై ఒక విషయాన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడే తాను ఈ సినిమా చూశానని , మంచి మేసేజ్ ఉన్న ఈ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని మహేష్ ను ప్రశంసించారు. దీనిని చూసి మహేష్ స్పందిస్తూ "ధన్యవాదాలు, మీకు ఈ సినిమా నచ్చడం తనకు చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు " . మొత్తానికి ఈ చిత్రంతో మహేష్ 25 చిత్రాల మైలు రాయిని తాను సొంతం చేసుకున్నాడు.
అయితే మహేష్ బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకేవరుతో' బిజీగా ఉన్నారు. అనిల్ రవిపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మండన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటులు రమ్య కృష్ణ మరియు విజయశాంతి కీలక పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించనున్నారు నిర్మాత బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరీలో దిగనుంది అని సమాచారం.