సావిత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ!
బిగ్ బాస్ 3 నుంచి ఎలిమినేట్ అయిన నటి హేమ.. ఆ షో జరిగిన తీరుపై మండిపడింది. తన అభ్యంతాలు చెబుతూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది నటి హేమ.. షోలో పాల్గొన్న అందరి గురించి హేమ కామెంట్లు చేసింది.
అందులో వీ6 ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా ఫేమస్ అయిన సావిత్రి.. అదేనండి అసలు పేరు శివజ్యోతిపై భలే కామెంట్ చేసింది. పాపం ఆ అమ్మాయి.. కాస్త పద్దతిగా ఉంటుంది. ఇటీవలే పెళ్లి, భర్త ఆ హడావిడిలో ఉంది. పరవాలేదు.. మనవాళ్లు ఆ సావిత్రిని కూడా నలుపుతారు.. పిసుకుతారు.. పిండేస్తారు.. దాంతో ఆమెలో ఒరిజినాలిటీ కూడా బయటపడుతుంది లెండి అంటూ కామెంట్ చేసింది.
ఇక వరుణ్ సందేశ్ గురించి చెబుతూ... వరుణ్కు తిండి అంటే చాలా ఇష్టమని, అస్తమానం కిచెన్కు వచ్చి సుగర్ వాటర్, కారం అన్నం అడిగేవారని హేమ అన్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయని, వీకెండ్కు వచ్చేసరికి మన పరిస్థితి ఏంటనేది ముందే చెప్పానని, ఉప్పు లేకపోతే కనీసం గంజన్నం కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుందని, ఆ పరిస్థితి రాకూడదనే మొదట్నించి కంట్రోల్ చేస్తూ వచ్చానని ఆమె చెప్పారు.
బిగ్ బాస్ 3 హౌస్లో వాళ్లు తనను అర్థం చేసుకోలేకపోయారని.. అంతకు మించి ఇంకేమిలేదన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదనన్నారు హేమ. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా హేమ మీడియా వాళ్లను కాస్త ఆకాశానికెత్తేసింది.. నా బలమూ బలహీనతా మీరే అంటూ మాట్లాడింది. హౌస్లో ఉన్న 14 మందిలో 8 మంది తనను బేడ్ అని అన్నారని, మిగిలినవారు మంచిగానే రాశారని హేమ చెప్పారు. వాళ్లు తనను అర్థం చేసుకోలేదని నటి హేమ అన్నారు.