ప్చ్.. బాలయ్య దెబ్బకి అంతా గందరగోళమే !
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. అయితే బాలయ్య ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఆ మధ్య కొని మార్పులు చెప్పారట. అయితే బాలయ్య సూచన మేరకు కె.ఎస్.రవికుమార్ కథలో మార్పులు చేసాడట. స్క్రిప్ట్ లో చేసిన మార్పులు గురించి ఇప్పటికే బాలయ్యకి కూడా వినిపించినట్లు తెలుస్తోంది. కానీ బాలయ్య లేటెస్ట్ వర్షన్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదట. బాగుందా..? లేక, బాగాలేదా..? అనే విషయం కూడా ఇంకా బాలయ్య బాబోరు చెప్పలేదట. దాంతో అనుకున్న తేదీ ప్రకారం ఆగష్టులో షూటింగ్ పెట్టాలా ? లేదా ? అని ఇంకా గందరగోళంలో ఉన్నాడట కె.ఎస్.రవికుమార్.
మన బాలయ్య బాబోరు పిలిచి షూటింగ్ పెట్టుకోండి అని చెప్పే వరకూ కె.ఎస్.రవికుమార్ పడిగాపులు కాయలా.. లేక షూటింగ్ పోస్ట్ ఫోన్ చెయ్యాలా అని అర్ధం కానీ పరిస్థితుల్లో ఉన్నాడట కె.ఎస్.రవికుమార్. ఇక ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నమితను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. కాగా ఈ సినిమాలో బాలయ్య - సోనాల్ చౌహాన్ ట్రాక్ ఎమోషనల్ గా సాగనుందని సమాచారం. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.
గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి 'లెజెండ్, డిక్టేటర్' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'డిక్టేటర్' తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అభిమానులు మాత్రం ఈ టైటిల్ను బాగా ఓన్ చేసుకున్నారు. ఎప్పటికైనా ఆ టైటిల్తో బాలయ్య సినిమా చేస్తే బాగుండని ఆశపడ్డారు. మరి వారి కోరిక ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ఈ సినిమాను మూడు నెలల్లోనే సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. గతంలో ఈయన బాలయ్యతో కలిసి 'జైసింహ' అనే చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే.