‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పై నిర్మాత అనిల్ సుంకర సంచలన కామెంట్స్...
ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడని మరియు ఆయన సరసన రష్మిక నటిస్తుంది అని నిర్మాత సుంకర తెలిపారు.అంతే కాకుండా విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు అని నిర్మాత తెలిపారు . మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సందర్భంగా ట్రైన్లో నిల్చున్న మహేష్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నిర్మాత అనిల్ సుంకర.
ఫొటోని సోషల్ మీడియా లో షేర్ చేయటంతో పాటు కామెంట్ కూడా పోస్ట్ చేశారు.సంక్రాంతి రేసులో నవ్వించేందుకు నవ్వుల ఎక్స్ప్రెస్ కదులుతోందని,నవ్వుల కెప్టెన్ అనిల్ రావిపూడితో కలిసి మన సూపర్స్టార్ 2020 సంక్రాంతిన అలరించేదుకు సిద్ధంగా ఉన్నారు అని కామెంట్ చేశారు . మరి క్రేజీ కాంబినేషన్గా తెరకెక్కుతున్న ఈ మూవీపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయని తెలిపారు .