తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురుచ్చితలైవి జయలలితగారి జీవితం ఆధారంగా వరుసగా పోటి పడి మరి బయోపిక్ లు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి' అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. అలాగే 'ది ఐరన్ లేడీ' అనే టైటిల్ తో లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని తెరకెక్కించనున్న మరో బయోపిక్ ను తీస్తోంది. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో నిత్య మీనన్ నటించనుంది. అలాగే సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా కూడా అమ్మ మీద ఒక బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు.
అలాగే వీరితో పాటు.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవిత కథ ఆధారంగా వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ లో రమ్యకృష్ణ , జయలలిత పాత్రలో నటిస్తుండగా శోభన్ బాబు పాత్రలో యాక్టర్ వంశీ అలాగే ఎంజీఆర్ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్ నటిస్తున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బయోపిక్ ల్లో కొన్ని ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టగా.. కంగనా నటిస్తోన్న తలైవి చిత్రం త్వరలోనే షూట్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ ఈ సినిమా కోసం తమిళ్ కూడా నేర్చుకుంది.
మొత్తానికి అమ్మ పై బయోపిక్ ల వర్షం కురుస్తోంది. మరి ఈ బయోపిక్ ల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి. అయితే అన్నీ బయోపిక్ లు కంటే కంగనా నటిస్తోన్న బయోపిక్ పై అంచనాలు ఎక్కువుగా ఉన్నాయి.