ప్రముఖ టీవీ నటుడు, 'బాహుబలి' ఫేం మధు ప్రకాశ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మధు ప్రకాశ్ సతీమణి భారతి (34) ఆత్మహత్య చేసుకున్న ఘటన మణికొండలో మంగళవారం చోటుచేసుకుంది. టీవీ సీరియల్స్లో నటిస్తున్న మధుప్రకాష్కు గుంటూరుకు చెందిన భారతి తో 2014లో వివాహమైంది. కుటుంబ కలహాలే భారతి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. భార్యభర్తల మధ్య గొడవలే భారతి మృతికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన మధు ప్రకాశ్.. బాహుబలి సహా పలు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు.
ఆమె నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. భర్తతోపాటు అత్తామామలు, మరిదితో కలిసి పంచవటి కాలనీలోని ఫ్లాట్లో నివసిస్తున్నారు. షూటింగ్ కోసం రోజూ ఉదయం బయటకు వెళ్లే మధుప్రకాష్ అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుంటారు. అయితే కొంత కాలంగా తన భర్త తనను పట్టించుకోవడం లేదని..షూటింగ్స్ అంటూ ఎప్పుడే వెళ్లడం ఎప్పుడో రావడం జరుగుతుందని ఆమె బతికుండగా ఆవేదన వ్యక్తం చేస్తుండేదని దీంతో ఇద్దరూ వేర్వేరు గదులో పడుకున్నారు.
మంగళవారం ఉదయం నిద్ర లేచిన మధుప్రకాష్ జిమ్కు వెళ్లి అక్కడి నుంచే షూటింగ్కు వెళ్లిపోయారు. తన భర్త తనకు దూరమైతున్నాడని ఆవేదనతో మనస్తాపానికి గురైన భారతి భర్తకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. వీడియో కాల్ చూసిన మధు ప్రకాశ్ ఆందోళనతో వెంటనే ఇంటికి చేరుకున్నారని..ఎంతగా పిలిచిన ఆమె స్పందించకపోవడంతో మారుతాళంతో తలుపు తెరవగా భారతి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఆయన మరో తాళంతో.. డోర్ తీసి లోపలికి వెళ్లి చూసేసరికే చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని భారతి కనిపించింది.
దీంతో.. షాక్ తిన్న మధు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. భారతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పంపించి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.రాయదుర్గం పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మధుప్రకాష్ మాటీవీలో ప్రసారమయ్యే కుంకుమ పువ్వు సీరియల్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.